మహిళా మెడలో నుంచి గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన నగరంలోని సుభాష్ నగర్ లో మంగళవారం ఉదయం జరిగింది.
స్థానిక రాధాకిషన్ సినిమా హల్ సమీపం లో రజని అనే మహిళా ఇంట్లోనే కిరాణా షాప్ నడుపుతుంది ఉదయం ఏడు గంటలకు బైకు మీద వచ్చిన యువకుడు మొదట సిగరెట్ తీసుకోని దమ్ముకొట్టాడు ఆమె డబ్బు ఇవ్వగా చిల్లర ఇవ్వడానికి రజినీ కౌంటర్ లో వంగింది అదే అదనుగా చేసుకొని మెడలో నుంచి గొలుసు తెంపుకొని రెప్పపాటు కాలం లోనే బైకు మీద మాయం అయ్యాడు బాధితురాలు కేకలు వేసి నప్పటికి ఉదయం అసలే చలి ఎక్కువుగా వుండడంతో ఎవ్వరు బయటికి రాలేదు.
చోరీ అయిన గొలుసు రెండు తులాలు వుంటుందని బాధితురాలు చెప్పింది.సమాచారం అందిన వెంటనే మూడో టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు.ఎస్సై స్థానికంగా యువకుడు ఆనవాళ్లను వాకబు చేసాడు
