విద్యార్థుల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారి చివరికి ఓ డిగ్రీ విద్యార్ధి హత్య కు దారితీసింది బోధన్బీసీ హాస్టల్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. గాంధారి మండలం తిప్పారం తండా కు చెందిన వెంకట్ బోధన్ పట్టణం లోని బీసీ ఇంటిగ్రేటెడ్ కాలేజీ హాస్టల్ ఉంటున్నాడు. అదే క్యాంపస్ లో ఇంటార్ కాలేజీ కూడా ఉంది. చదువుల్లో ఫస్ట్ ఉండే వెంకట్ ను ఇంటర్ విద్యార్థుల స్టడీఅవర్ పర్యవేక్షణచేయాలనీ వార్డెన్ పురమాయించాడు.
దీనితో వెంకట్ తో రెండు రోజుల క్రితం ఇంటర్ విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. తమ పెత్తనం సాగిస్తున్నాడని కక్ష్య పెంచుకున్నారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఆరుగురు కలిసి డిగ్రీ విద్యార్థి వెంకట్ (23) ఫై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు దీనితో వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఆధారాలను సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బోధన్ లోని ఉన్న బీసీ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్ ది గాంధారి మండలం తిప్పారి తండా పోలీసులు గుర్తించారు. అలాగే హత్యకు గల కారణాలకు తెలుసుకున్న పోలీసులు నింధితులైన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మృతుని బంధువులు పెద్దసంఖ్యలో బోధన్ కు తరలివచ్చారు. స్టేషన్ ఎదుట బైఠాయించారు.