మాజీ కెసిఆర్ కు త్వరలో చర్ల పల్లి జైలు లో చిప్పకుడా తినిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి ఆయన తుక్కుగూడ సభ వేదికగా రాహుల్ గాంధీ సమక్షంలోనే కెసిఆర్ ఫై తీవ్రస్థాయిలో చెలరేగి పోయారు. ఎలాగో పేదలకు డబుల్ బెడ్ రూమ్ కట్టివ్వలేదు కానీ నేను మాత్రం కెసిఆర్ కు చర్ల పల్లి జైలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానన్నారు.
ఎందుకంటే కొడుకు కోడలు కూతురు అల్లుడు వస్తే ఎక్కడుంటారని అందుకే కెసిఆర్ కు జైలు లోడబుల్ బెడ్ రూమ్ ఇల్లు అవసరమన్నారు. లత్కోర్ మాటలు అంటే ఉరుకోవడానికి తానేమి జానారెడ్డి ని కాదని రేవంత్ రెడ్డి నన్నారు. నా వెంట్రక కూడా పీక లేరని కెసిఆర్ విర్రవీగుతున్నారని కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కెసిఆర్ ముడ్డికి ఉన్న డ్రాయర్ కూడా ఊడబీకేస్తారని అన్నారు.
ఏదో కాలు విరిగింది కూతురు జైలు కు వెళ్ళింది కదా అని సానుభూతి తో నేర్పుగా ఉన్నాం కానీ నిన్న వదిలి పెట్టబోమన్నారు. కొన్ని కుక్కలు మురుగుతుండే ఇప్పుడు ఓ నక్క బయలు దేరింది. పదేళ్ల పాలన లో వందేళ్ల సరిపడా ధ్వంసం చేసారు. పంది కొక్కుల్లా దోచుకున్నారని మండిపడ్డారు.