ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నగరానికి బుధవారం వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు.
ఎంపీ గా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ని గెలిపిస్తే
మహిళా డిగ్రీ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ
రింగ్ రోడ్డు
లతో పాటు స్మార్ట్ సిటీ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చారని బయ్యారం ఉక్కు కర్మాగారం రైల్వే కోచ్ పసుపు బోర్డు స్మార్ట్ సిటీ రింగ్ రోడ్డు లు ఇవ్వకుండా గాడిద గుడ్డు ఇచ్చారని అలాంటి మోడీ ఈసారి మళ్ళీ వోట్లు ఎలా వేస్తామన్నారు.
కర్రు కాల్చి వాత పెట్టకపోతే ఎలా అన్నారు. ప్రజాస్వామ్య దేశంఇప్పుడు నియంత పాలన వైపు వెళ్తుందన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే కుట్ర జరుగుతుందని యస్సి ఎస్టీ బీసీ ల రిజర్వేషన్ లు రద్దు చేయడానికి రాజ్యాంగం మార్చేస్తామని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు.