HomeLaw and Orderపెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం..

పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం..

పెర్కిట్ మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ పి.ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేశారు.

గత మార్చి నెల 02 వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటిషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన తాత్కాలిక ఇన్ స్ట్రక్టర్ గా కొనసాగిన స్నేహ, బాలికలు, యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లను సతీష్ అనే వ్యక్తికి పంపించిందని అన్నారు. దీంతో సతీష్ కొంతమంది యువతులకు ఫోన్ లు చేసి, వాట్సప్ చాటింగ్ ల ద్వారా వేధింపులకు గురి చేశాడని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం రోజున తమ దృష్టికి తేగా, పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించామని తెలిపారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు.

ఈ తరహా చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. పెర్కిట్ మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన యువతులను వేధించిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ తరహా ఘటనలు జిల్లాలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments