ఆర్మూర్ లోనీ జీరాయత్ నగర్ కాలానికి కతిపోట్ల కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్లితే…పేర్కిట్ కు చెందిన షేక్ తాహిర్(21) యువకునిపై షాహిద్, జిషన్, వజిద్,సమీర్ లు ఆదివారం రాత్రి కత్తితో పొడిచినట్లు బాధితుడు తెలిపారు.
దీంతో సదరు యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.అక్కడే ఉన్న స్థానికులు క్షతగాత్రడిని హుటాహుటిన ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గొడవకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.
