అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో జియమ్మ వలసలో బుధవారం ఉదయం మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది ఇద్దరు అగ్ర నేతలతో సహా ఏడుగురు మృతిచెందారు .
ఉదయం 6.30- సమయంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు చెప్తున్నారు . మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత మెట్టూరి దుర్గారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్లు సమాచారం.
కాగా, పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఆ విషయం ధృవీకరణ కాలేదు.
మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. మృతులపై పోలీసులు అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. దీనిపై మరికాసేపట్లో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
