HomeCRIME‘డబుల్ రిజిస్ట్రేషన్’ ఘరానా మోసం!ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించిన వన్‌టౌన్ పోలీసులు..

‘డబుల్ రిజిస్ట్రేషన్’ ఘరానా మోసం!ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించిన వన్‌టౌన్ పోలీసులు..

. దశాబ్దం క్రితం తండ్రి ఓ సొసైటీకి అమ్మేసిన భూమిని.. ఆయన మరణాన్ని కూతురు ఆసరాగా చేసుకుని, గుట్టుచప్పుడు కాకుండా ఫోర్జరీ డాక్యుమెంట్లతో మళ్లీ వేరొకరికి అంటగట్టారు. కాసుల కక్కుర్తితో ‘డబుల్ రిజిస్ట్రేషన్‌’కు తెగబడిన ఈ ఘరానా మోసం ఉదంతంలో ముగ్గురు నిందితులను నిజామాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. కంటేశ్వర్ శివార్లలోని ఒక సర్వే నంబర్ పరిధిలో ఉన్న భూమిని సదరు యజమాని ఎర్రన్న గత 1981లోనే ఒక సొసైటీకి విక్రయించారు. కాలక్రమేణా ఎర్రన్న మరణించారు. అయితే, తండ్రి మరణించిన విషయాన్ని, ఆ భూమి అప్పట్లోనే చేతులు మారిన ఉదంతాన్ని ఆయన కుమార్తె పుష్ప పూర్తిగా మరుగున పరిచింది.

సొసైటీ వాళ్లకు తెలియకుండా ఫోర్జరీ పత్రాలు సృష్టించి, రిజిస్ట్రేషన్ల శాఖలోని లొసుగులను ఆసరాగా చేసుకుంది. 2018లో అదే భూమిని మరొకరికి విక్రయించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సాక్షిగా రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించేసింది. ఒకే భూమికి సంబంధించి అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందని గుర్తించిన ఇన్‌ఛార్జ్ ఈ ఘరానా మోసంపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో విచారణ జరపగా.. నిందితులు ఉద్దేశపూర్వకంగానే, పాత రిజిస్ట్రేషన్ వివరాలను దాచిపెట్టి, ఫోర్జరీకి పాల్పడి ఈ మోసం చేసినట్లు తేలింది.

దీంతో ఈ భూ దందాలో ప్రధాన సూత్రధారి అయిన పుష్ప, ఆమెకు సహకరించిన భర్త శంకర్, బావ భూమన్న లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments