నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు అజరుద్దీన్ అదనపు కమిషనర్ ని కలిసి, వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం మరియు రోడ్లు అత్యంత అధ్వాన్నంగా మారడం వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ అన్నారు.
డ్రైనేజీ సమస్యలు: కాలనీలో మురుగునీరు రోడ్లపైకి చేరుకుని, దుర్వాసనతో పాటు దోమలు, అంటువ్యాధులు పెరిగేందుకు కారణమవుతోందని నాయకులు వివరించారు.
రోడ్ల దుస్థితి: రోడ్లు పూర్తిగా గుంతలమయమై, వర్షాకాలంలో మరింతగా పాడైపోతున్నాయని, దీనివల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ సమస్యలను తక్షణమే గుర్తించి, మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో త్వరగా కొత్త డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని మరియు పాడైన రోడ్లను పునరుద్ధరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
స్థానిక ప్రజల పక్షాన ఈ సమస్యల పరిష్కారానికి తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, తదుపరి చర్యల కోసం సిద్ధంగా ఉన్నామని అన్నారు.
