రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఎంపీ బారిష్టర్ అసవుద్దీన్ ఓవైసీ సూచించారు.
శుక్రవారం ఆయన బోధన్ నిజామాబాద్ లలో పర్యటించారు బోధన్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మీరు ఇలియాస్ అలీ ఇంటి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని
ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు ఐక్యంగా కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. బోధన్ మున్సిపాలిటీలో గతంలో సాధించిన కౌన్సిలర్ల సంఖ్యకు రెట్టింపు విజయాన్ని సాధించాలని అన్నారు.
బోధన్ మున్సిపాలిటీ పై ఎంఐఎం జెండా ఎగరవేసే విధంగా పనిచేయాలని తెలిపారు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసీ తో పాటు మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బళ్లాల, ఎంఐఎం పార్టీ నిజాంబాద్ జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్, నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు షకీల్ హైమద్ ఫాజల్,లున్నారు .
