కూతురిని గొంతు నులిమి చంపిన కసాయి తండ్రి ఈ ఘటన నిజామాబాద్ లో నీ దర్మోర లో చోటు చేసుకుంది. లక్కీ (4)ను తండ్రి అరుణ్ నిద్రిస్తున్న చిన్నారిని గొంతు నొక్కి చంపేశాడు.పోలీస్ లు తెలిపిన కథనం ప్రకారం.. మాక్లూరు మండల కేంద్రంలోనీ ధర్మోరా గ్రామానికి చెందిన ఇర్ణాల అరుణ్ గత ఏడాది క్రితం నిజామాబాద్ కు చెందిన సునీత నీ రెండవ వివాహం చేసుకున్నారు.
అయీతే సునీత మొదటి భర్తకు జన్మించిన ఒక కూతురు అయినా లక్కీ అనే పాప ఉంది. అరుణ్ వివాహ సమయంలో సునీత తో పాటు లక్కీ నీ కూడా తీసుకొని వెళ్ళాడు. ఈ క్రమంలో అరుణ్ తరుచూ భార్య తో పాపని నా ఇంట్లో వదని తరచుగా గొడవ చేశాడు.గత 3నెలల క్రితం పాప అయినా లక్కీ నీ కొట్టి చెయ్యి విరిచాడు.అప్పటి నుంచి పాపని సునీత నిజామాబాద్ లో ఉన్న తల్లీ దగ్గరికి పంపించేసింది.
అయితే బుదవారం సునీత తన కూతురిని చూడాలని భర్త అరుణ్ కి తెలిపింది.అందుకు అరుణ్ మరియు వల్ల అక్కలు మాజీ భార్య లా తో కలిసి నిజామాబాద్ నుంచీ పాపని తీసుకొని ధర్మొర కి వెళ్ళాడు.
పాప లక్కీ నిద్రిస్తున్న సమయంలో తల్లీ సునీత స్నానానికి వెళ్ళింది ఈ క్రమంలో అరుణ్ ఇతర ముగ్గిరి సహాయంతో నిద్రిస్తున్న కూతురిని గొంతు నులిమి హత్య చేశాడని తల్లీ వాపోయింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు.
అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ కుమార్ తెలిపారు.