నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. సీడీఎంఏ శ్రీదేవిని హైదరాబాద్ లోని కార్యాలయంలో కలిసి పలు అంశాలపై మాట్లాడారు.
ప్రధానంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇందూరు అభివృద్ధి కొరకు నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే కార్పొరేషన్ కు రావాల్సిన జనరల్ ఫండ్, ఇతర పనులను మంజూరు చేయాలన్నారు.
