ఏపీ కి కేటాయించిన ఐ ఏ ఎస్ ఐపిఎస్ లు అక్కడే పనిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ట్రిబ్యునల్ ఇచ్చిన అదే ఆదేశాలను సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో బుధవారం వాదనలుజరిగాయి అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలి.
కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తాం. రిపోర్ట్ చేయకుండా ఏమీ చేయలేం. ప్రజాసేవ కోసమే ఐఏఎస్లు. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్లాలి.
ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్ కాదు. మీ వాదనలు వింటాం.. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది
