తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో కాల్పుల మోత తో మారుమోగింది. శనివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టు నక్సలైట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది . ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు గా పోలీసులు అనుమానిస్తున్నారు .
ఎన్కౌంటర్ సందర్భంగా ఒక ఏకే-47 తో పాటు మరో .మూడు తుపాకులు, ఇతర పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్న మని పోలీసులు తెలిపారు .ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని కర్రిగుట్టలు- చత్తీస్ గఢ్ లోని పూజారి కాంకేర్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో ఘటన.జరిగింది ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు చెప్తున్న మృతుల్లో ఎవరెవరున్నారనేది ఇంకా నిర్ధారించుకోలేక పోతున్నారు కానీ , ఘటనా స్థలంలో ఏకే-47 లభ్యం కావడంతో మృతుల్లో కీలక నేతే ఉండొచ్చని భావిస్తున్నారు