Monday, May 20, 2024
HomeTelanganaNizamabadప్రశాంత్ రెడ్డి కి ఝలక్ ……కాంగ్రెస్ లోక్ జడ్పిటిసి సభ్యుడు …….

ప్రశాంత్ రెడ్డి కి ఝలక్ ……కాంగ్రెస్ లోక్ జడ్పిటిసి సభ్యుడు …….

బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు చేజారుతున్నారు. ఈపాటికే డీసీసీబీ వైస్ ఛైర్మెన్ 18 డైరెక్టర్ లతో తిరుబాటు చేసి డీసీసీబీ లో పాగ వేయగ ఇప్పటికి ఆతని మీద డైరక్టర్ ల మీద కనీస క్రమశిక్షణ చర్యలు తీసుకోలేని నిస్సహాయ పరిస్థితి బిఆర్ యస్ పార్టీ ది.

తాజాగా ఎరగట్ల జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సున్నపు అంజయ్య,ధమ్మనోళ్ళ శ్రీను,అన్వర్ లు బాల్కొండ మాజీ mlaఈరవర్తి అనిల్ ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ గెలుపుకోసం కష్ట పడి పనిచేయలని కోరారు, ఈ కార్యక్రమంలో బాల్కొండ బ్లాక్ అధ్యక్షులు ఆడేం గంగా ప్రసాద్,డీసీసీ డెలిగేట్ జీవన్ రెడ్డి,జిల్లా జండ్రల్ సెక్రెటరీ పెద్దిరెడ్డి రవి, బాల్కొండ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ,వేల్పూర్ మండల అధ్యక్షులు నర్సారెడ్డి , మెండోరా మండల అధ్యక్షులు ముత్యం రెడ్డి, జిల్లా జండ్రల్ సెక్రెటరీ శ్రీను,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్,యూత్ నాయకులు రొక్కెడ సంజీవ్ ,గణేష్ ,జుంగల రాజేష్ తది తరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments