భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరుక గూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలోఎదురు కాల్పులు జరిగాయి.
ఈ ప్రాంతంలో నక్సల్స్ కదలికలున్నాయనే సమాచారం మేరకు గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు చర్యలు మొదలు పెట్టింది.
సాయుధ నక్సల్స్ తారస పడడంతో ఎదురు కాల్పులు.జరిగాయి ఈ ఘటన లో ఆరుగురు నక్సల్స్ మృతి.
చెందారని సమాచారం ఎదురు కాల్పుల్లో ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ సైతం తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు సాగిస్తుంది మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం పార్టీ లో రిక్రూట్ మెంట్ చేస్తుందనేది పోలీసుల అనుమానం .
లచ్చన్న గతంలో దంతెవాడ జిల్లాలో పనిచేసారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మరో సారి మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బ తగిలింది
