తాళం వేసిన ఇంట్లో భారీ చోరి జరిగింది. ఈ ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే అక్బర్ బాగ్ కు చెందిన మిస్బా కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల క్రితం హాస్పిటల్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళారని స్థానికులు తెలిపారు.
ఈ మేరకు గమనించిన దుండగులు గురువారం రాత్రి ఇంట్లోకి చొరబడి బీరువా నుంచి సుమారు 5 తులల బంగారం, వెండి కొంత నగదు అపహరించినట్లు తెలిపారు.
ఈ మేరకు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.
