Friday, April 18, 2025
HomeCRIMEఅదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు…

అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు…

అదృశ్యమైన వ్యక్తి మంగళవారం శవమై తేలిన ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం. నిజామాబాద్ నగరంలోని సాయి నగర్ కు చెందిన అరిగేలా గంగారం(65).

ఆదివారం నగరంలో ఊర పండగ సందర్భంగా సాయంత్రం సమయంలో వైన్స్ కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళాడు. రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ ఆచూకీ కోసం కుటుంబీకులు వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ మేరకు వర్షం నీటితో నిండిన కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు తెలిపారు. మంగళవారం పక్కనే నూతనంగా నిర్మిస్తున్న భవన కార్మికులు చూసి పోలీసులు లకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐదవ టౌన్ పోలీసులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!