కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత కేసును మూడు నెలలో తేల్చాలని సుప్రీం దర్మాసనం స్పష్టం చేసింది. ఏళ్ల తరబడిగా ఇలాంటి పిటిషన్ లను పెండింగ్ లో పెట్టడం కుదరదని వారు పేర్కొన్నారు.
బిఆర్ యస్ కు చెందిన ఎమ్మెల్యే లు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి కేటీఆర్ లు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది.
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత తేల్చాలని అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
