మూడు రాష్ట్రాలకుగానూ కొత్త పీసీసీలను ఖరారు చేసినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్గా దీపాదాస్ మున్షీ, కేరళకు కేసీ వేణుగోపాల్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
దీనిపై అగ్ర నేతలు సోనియా గాంధీ రాహుల్ ప్రియాంక ఖర్గే లు ఆమోదం ముద్ర వేసారని సమాచారం కేరళకు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ స్థానంలో రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్,
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ భఘేల్ని నియమించే అవకాశం ఉంది
