ఎల్లారెడ్డి. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. బుధవారం ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిలో గండి మాసానిపేట్ గ్రామ సొసైటీ వద్ద ప్రధాన రహదారిపై వారు రాస్తారోకో చేశారు.
ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా బుక్ అవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో బుక్ అవ్వకపోవడంతో తమకు యూరియా కష్టాలు మొదలయ్యాయని వారు పేర్కొన్నారు. పాత పద్ధతిలోనే తమకు యూరియా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
