పద్మశాలి వసతి గృహ సంస్థ సమావేశం ఆదివారంనిజామాబాదు నగరంలోని వర్నిరోడ్ లో ఉన్న పద్మశాలి హాస్టల్ లో జరిగింది. మున్సిపల్ కార్పోరేషన్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాదించిన కార్పోరేటర్లు ఇప్పకాయల సుమిత్ర,సామల ప్రసన్నలకు ఈ సందర్భంగా పద్మశాలి వసతి గృహం ఆద్వర్యంలో సన్మానించారు.
కార్యక్రమంలో పద్మశాలి హాస్టల్ అధ్యక్ష కార్యదర్శులు దీకొండ యాదగిరి,గంట్యాల వెంకటేష్,కోశాధికారి కన్న రాజు,పద్మశాలి సంఘాల ప్రతినిధులు బిజ్జు దత్తాద్రి,దాసరి నర్సింలు,పుల్గం హన్మాండ్లు,మైసల నారాయణ,సామల సత్యపాల్,బాస రాజేశ్వర్,పార్థసారథి, హరిదాస్,తన్నీరు శ్రీనివాస్,లక్కవత్రి దేవీదాస్ తదితరులు పాల్గొన్నారు.
