నగరంలోని ఆటోనగర్లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఆరవ టౌన్ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.31,560 నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. పేకాట, ఇతర అక్రమ కార్యకలాపాలపై పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
