Friday, April 18, 2025
HomePOLITICAL NEWSడీసీసీబీ ఛైర్మెన్ గా రమేష్ రెడ్డి ......ఎట్టకేలకు హస్తగతం ..........ఏకగ్రీవంగా ఎన్నిక

డీసీసీబీ ఛైర్మెన్ గా రమేష్ రెడ్డి ……ఎట్టకేలకు హస్తగతం ……….ఏకగ్రీవంగా ఎన్నిక

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి నియామకం అయ్యారు. మంగళవారం బ్యాంక్ ఆవరణలోని మీటింగ్ హాల్లో డీసీఓ శ్రీనివాస్ రావు చేతుల మీదిగా నియామక పత్రం అందుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.

ఈనెల 21న భాస్కర్ రెడ్డి మీద అవిశ్వాసం నెగ్గడంతో మంగళవారం కొత్త చైర్మన్ పదవి కోసం ఈరోజు నామినేషన్ ప్రక్రియ నిర్వహించామని, చైర్మన్ పదవికి కుంట రమేష్ రెడ్డి ఒక్కరే నాలుగు సెట్లు నామినేషన్ వేశారని, స్క్రూటినీ అనంతరం ఒక్కరే ఉండడంతో కుంట రమేష్ రెడ్డిని ఏకగ్రీవంగా చైర్మన్ గా ప్రకటించినట్టుడీసీవో శ్రీనివాస్ చెప్పారు. పాలక వర్గం 21 మందికి గాను 18 మంది హాజరు అయ్యారని అన్నారు.

తన నియామకానికి స హకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్ లకు, కాంగ్రెస్ నాయకులకు డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా ఎల్లప్పుడూ జిల్లా రైతన్నలకు తన సహకారం ఉంటుందని, రైతులకు, డైరెక్టర్లకు, ఉద్యోగులకు అందుబాటులో ఉంటారని అన్నారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవం చేసినందుకు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండాచర్యలు తీసుకుంటామన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!