బోధన్ ఎస్బిఐ బ్యాంకులో చోరి జరిగింది.ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్లితే..
ఈ నెల 8న బోధన్ పట్టణంలోనీ ఎస్బిఐ బ్యాంకు లో ఇద్దరు వ్యక్తులు,ఒక బాలుడు కలిసి బ్యాంకులో డబ్బులు జమచేయడానికి వచి వెళ్లిపోయారు.ఇంతలోనే క్యాసియర్ తన పక్కనే ఉన్న నగదును చూడగా అది గమనించగా రూ 5 లక్షలు కనిపించకుండా పోయింది.దీంతో సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ బాలుడు కౌంటర్ లోకి వెళ్లి 5 లక్షలు చోరి చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు.అయితే ఈ ముఠా మధ్యప్రదేశ్ కు చెందిన వారికిగా పోలీసులు అనుమానిస్తున్నారు.వీరి కోసం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
