HomeTelanganaNizamabadజనకంపేటలో అత్యాధునిక గూడ్స్ షెడ్ ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ఎంపీ అరవింద్

జనకంపేటలో అత్యాధునిక గూడ్స్ షెడ్ ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ఎంపీ అరవింద్

నీజామాబాద్‌ జిల్లా పారిశ్రామిక, వ్యవసాయ రవాణా రంగానికి కొత్త ఊపిరి పోస్తూ, జనకంపేట రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన గూడ్స్ షెడ్‌ను నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

రూ. 9 కోట్ల వ్యయంతో ఈ గూడ్స్ షెడ్‌ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రైల్వే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వివరించారు.సుమారు రూ. 9 కోట్ల వ్యయంతో జనకంపేట స్టేషన్‌లో అభివృద్ధి చేసిన గూడ్స్ షెడ్ రవాణా రంగానికి ఎంతో మేలు చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. 700 x 16 మీటర్ల విస్తీర్ణంలో స్లీపర్ మ్యాటింగ్‌తో గూడ్స్ ప్లాట్‌ఫారమ్ నిర్మించారు.

8 మీటర్ల వెడల్పు గల రెండు అప్రోచ్ రోడ్లు, 8 హై-మాస్ట్ లైట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఇక్కడ బియ్యం, మొక్కజొన్న, జొన్నలు లోడ్ చేస్తుండగా, ఎరువులు, సిమెంట్ అన్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం లోడింగ్ కోసం 10-12 రేకులు, అన్‌లోడింగ్ కోసం 15-17 రేకుల కార్యకలాపాలు సాగుతున్నాయని, రాబోయే రోజుల్లో రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచుతామని ఆయన స్పష్టం చేశారు.

గత 12 ఏళ్లుగా ప్రధాన మంత్రి నాయకత్వంలో తెలంగాణ రైల్వే రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. 2014-15లో కేవలం రూ. 258 కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులు, 2026-27 నాటికి రూ. 5,454 కోట్లకు పెరిగి, సుమారు 20 రెట్ల వృద్ధిని సాధించాయి.

గత 12 ఏళ్లలో పెద్దపల్లి-నిజామాబాద్, జగ్గయ్యపేట-విష్ణుపురం, భద్రాచలం-సత్తుపల్లి, అక్కన్నపేట-మెదక్, మనోహరాబాద్-సిద్దిపేట వంటి ముఖ్యమైన ప్రాజెక్టులతో మొత్తం 340 కి.మీ కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, 562 కి.మీ మేర డబుల్, మూడో మరియు నాలుగో లైన్ పనులు పూర్తి కాగా, మనోహరాబాద్-సిద్దిపేట మార్గం మినహా రాష్ట్రవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్ వందశాతం విద్యుదీకరించబడింది.

ప్రస్తుతం రూ. 42 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్నాయి.ముద్ఖేడ్-మేడ్చల్ డబ్లింగ్‌లో భాగంగా బాసర-నావిపేట మధ్య 15 కి.మీ మార్గం వినియోగంలోకి వచ్చింది. ధర్మాబాద్-మేడ్చల్ మధ్య 172 కి.మీ పరిధిలో ‘కవచ్’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

నిజామాబాద్‌ స్టేషన్‌లో యార్డ్ రీమోడలింగ్, అదనంగా రెండు లూప్ లైన్లు,ఆర్మూర్-మామిడిపల్లి (రూ. 38 కోట్లు),మామిడిపల్లి-నిజామాబాద్ (రూ. 25 కోట్లు) మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యాయి అని పేర్కొన్నారు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 58 కోట్లతో నిజామాబాద్‌ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, రూ. 124 కోట్లతో 2 కి.మీ బైపాస్ లైన్ నిర్మాణం, ‘కవచ్’ 4.0 అప్‌గ్రేడ్, క్విక్ వాటరింగ్ సిస్టమ్ మరియు మరో మూడు ఆర్ఓబీల పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments