కేంద్రానికి కట్టాల్సిన పన్ను ఎగొట్టాడనే ఆరోపణల ఫై బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ని కేంద్రం పన్నుల విభాగం స్పెషల్ టీం అదుపులోకి తీసుకోని విచారిస్తుంది రాష్టవ్యాప్తంగా పన్ను ఎగవేతకు పాల్పడిన వారిని గుర్తించడానికి డీజీజీఐ అధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్రెడ్డి రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని గుర్తించారు.
మూడు నెలల గడువు ముగిసినా జీఎస్టీ చెల్లించకపోవడతో తదుపరి చర్యలు తీసుకున్నారు వినియోగదారుల నుంచి వసూలు చేశారు.
అధికార పార్టీకి చెందిన నేత జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ కావడం కలకలం రేపింది.
జిఎస్టి అధికారులు తనను అరెస్టు చేసే అవకాశం వుందని ముందే పసిగట్టిన సునీల్ రెడ్డి తాను రెండు రోజులు అందుబాటులో వుండడం లేదంటూ సమాచారం ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నట్లుగా సమాచారం
