నిజామాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో ముందంజులో నిలిపేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్, అధికారులు విజ్ఞప్తి చేశారు.
స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క చొరవ ఎక్కువ ప్రజల భాగస్వామ్యాన్ని ఉత్పత్తి చేయడం, “పరిశుభ్రత ప్రతి ఒక్కరి వ్యాపారం” అనే భావనను బలోపేతం చేయడం మరియు దేశవ్యాప్త ప్రచారంతో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ముగించడం లక్ష్యంగా నగరపాలక సంస్థ పరిధిలో చేయడం జరుగుతుందనీ పేర్కొన్నారు.
విద్యార్థులు,యువత, మహిళలు, రెసిడెన్షియల్ కాలనీల ప్రజలు, ప్రజాప్రతినిధుల శ్రమదానాలు, మానవ హారం, తడిచెత్త పొడిచెత్త వేరు చేయడం కార్యక్రమాలు నిర్వహించారు.
వేరు చేసిన చెత్తను రెండు బుట్టల పద్ధతిలో వాహనానికి అందజేయడం, కాలనీల పరిశుభ్రత, డ్రెయిన్ ల పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు, పార్కుల పరిశుభ్రత, తడిచెత్త నుండి కంపోస్టు తయారీ, పొడి చెత్తను రీసైక్లింగ్ విధానంలో పునర్వియోగం తదితర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో నిర్వహించే పనులను సకాలంలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే నగరంలోని పోలీస్ లైన్ డివి నెం 21లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పొడి చెత్త, తడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


