కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ రెడ్డి సామజిక వర్గం ఫై మల్లన్న అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతీవ్ర దుమారం రేపింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన హైకమాండ్.. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
