నిద్రలో ఉన్న ఇద్దరి ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసిన పారిపోయారు మేడ్చల్ శివారు లోని ..
కిష్టాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బీహార్కు చెందిన పవన్ కుమార్, సంతోష్ కిష్టాపూర్ లో వుంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లొకిచొరబడి గొంతు కోసి పరారయ్యారు.
స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అందులో సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
