HomeTelanganaNizamabadఅభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలి.....

అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలి.. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కీలకంగా వ్యవహరించాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఆదివారం జిల్లా కేంద్రంలో విపుల్ గౌడ్ అధ్యక్షతన జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా యూత్ కాంగ్రెస్ ఇంచార్జిలు అల్మాస్ ఖాన్, వినోద్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ శ్రేణులు క్రమశిక్షణతో మెలిగినప్పుడే రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారని హితవు పలికారు.

రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల (పరిషత్), మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని, అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలని దిశానిర్దేశం చేశారు.

అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. సమావేశం అనంతరం ఇటీవల సర్పంచ్‌లుగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ నాయకులను నాయకులు ఘనంగా సన్మానించారు. పార్టీ అభివృద్ధిలో భాగస్వాములైన యువ నాయకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నరేందర్ గౌడ్, రాజు గౌడ్, ఆదిత్య, జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బోల్ల శ్రీకాంత్, అసెంబ్లీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు సోషల్ మీడియా విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments