నూతన సంవత్సర వేళ జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) రాజేందర్ ని ‘ఇది సంగతి’ పత్రిక ఎడిటర్ సూరన్న గారి నర్సాగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘ఇది సంగతి’ పత్రిక తరపున రూపొందించిన నూతన క్యాలెండర్ను అందజేశారు. నగర అభివృద్ధిలో అధికారులు చేస్తున్న కృషిని అభినందించగా, పత్రికలు కూడా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని అధికారులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు తమలపాకుల గంగాధర్, సుంకరి గంగాధర్, ఉల్లెంగ నాగరాజు, దాసు, రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు.
