మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం
జిల్లా అధ్యక్షులు మండే మోహన్ పటేల్
14న కరీంనగర్ లో జరిగే పటేల్ యూత్ గర్జన సభ విజయవంతం చేయాలని,
మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మండే మోహన్ పటేల్ అన్నారు..
కరీంనగర్ జరిగే 14 న పటేల్ యూత్ గర్జన సభలో పలు అంశాలపై చర్చ అనంతరం పటేల్ గెజిట్ కోసం
గ్రామస్థాయి నుండి, మండలం, డివిజన్, జిల్లా, ప్రెస్ అప్ గవర్నమెంట్ వరకు గెజిట్ కోసం కావలసిన, పత్రాలు, వాటి పూర్తి వివరాలు కులం కుశంగా చర్చ ఉంటుందన్నారు.
ఇకనుండి ప్రతి మున్నూరు కాపు కులస్తులకు పటేల్ పెరు తప్పనిసరిగా గెజిట్ తీసుకొస్తామని, అలాగే పల్లెటూరు నుండి హైదరాబాద్ ఫై వరకు వెళ్లి చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు వేరువేరుగా వెయ్యి మంది తో కూడిన బాలికల హాస్టల్ వసతి భవనం, వెయ్యి మందితో కూడిన హాస్టల్ వసతి భవనం కొరకై పటేల్ యూత్ గర్జన సభ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. యువత ప్రతి ఒక్కరు విధిగా కరీంనగర్ పటేల్ గర్జన సభను విజయవంతం చేసి మన ఐక్యతను చాటాలను కోరారు.