బస్సులో మహిళ బ్యాగులో గొలుసును గుర్తు తెలియని ఇద్దరు మహిళలు అపహరించారు. ఈ సంఘటన నగరంలో చోటు చేసుకుంది.
ఒకటవ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నగరంలోని దారుగల్లి కి చెందిన రిటైడ్ ఉద్యోగిని ముంతాజ్ బేగం ఈ నెల 23 న హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్న సమయంలో పక్క సీటులో ఇద్దరు గుర్తు తెలియని మహిళలు కూర్చున్నారని వారు నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దిగిపోయారని తెలిపారు.
ముంతాజ్ బేగంఇంటికి వెళ్లి చూసే సరికి బ్యాగునుంచి ఐదున్నర తులాల బంగారు గొలుసు కనిపించలేదు.దీంతో మంగళవారం ఒకటవ టౌన్ లో ఫిర్యాధు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
