ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన సంఘటన నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హస్మి కాలానికి చెందిన మహమ్మద్ బిలాల్ (5). ఆయేషా ఫాతిమా (6). మొహమ్మద్ అలీ (7).
ఈ ముగ్గురు పిల్లలు కలిసి కాలనీలోని కిరణ దుకాణం వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళారు. ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఐదవ టౌన్ లో ఫిర్యాధు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ముగ్గురు పిల్లలు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు,పోలీసులు గాలిస్తున్నారు. పిల్లల ఆచూకీ తెలిసినవారు ఐదవ టౌన్ ఎస్సై 8712659844 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
