మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఏఎస్ఐ..ఫిట్స్ వచ్చి రోడ్డు మీద పడిపోయిన ఓ వ్యక్తినీ కాపాడి ట్రాఫిక్ ఏఎస్ఐ కోటేశ్వర్ రావు మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటన నగరంలోని బోధన్ బస్టాండ్ వద్ద జరిగింది.
శుక్రవారం కరీం నగరంలోని బోధన్ బస్టాండ్ ప్రాంతంలో అరటి పండ్ల బండి పెట్టుకొని ఉన్నాడు.దీంతో అంతానికి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏఎస్ఐ కోటేశ్వర్ రావు వెంటనే స్పందించి ప్రథమ చికిత్స కోసం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అలాగే అతని ఆర్థిక పరిస్థితి చూసి రూ 500 నగదు హాస్పిటల్ నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, సీఐ ప్రసాద్, స్థానికులు ట్రాఫిక్ ఏఎస్ఐ కోటేశ్వర్ రావును అవినందించారు.
