గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తు లను అరెస్టు చేసి వారి నుంచి 2.050 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్న ఘటన బోధన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.
ప్రొహిబి షన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి ఆదేశాల మేరకు బోధన్ పట్టణ శివారులోని లోనీ ఇద్దరు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమా చారం మేరకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
షేక్ బాబర్ మియ,గుర్రాల శంకర్ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద 2.050 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈమేరకు ద్విచక్ర వాహనం సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ అధికారులు వెల్లడించారు.
