పెద్దపులి పంజాకు ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన మహారాష్ట్ర రాష్ట్రం చంద్ర పూర్ జిల్లా తడోబా టైగర్ రిజర్వులో జరిగింది.
సమీప గ్రామాలకు చెందిన కూలీలు ప్రేమ్ సింగ్, భీమ్రావు ఈరోజు ఉదయం వ్యవసా య పనులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు మహారాష్ట్ర అటవీ శాఖాధికారులు చెబుతు న్నారు.
గతంలో తడోబా అడవి నుంచి పెద్దపు లులు కాగజ్నగర్, ఆసిఫాబాద్ ప్రాంతాలకు వలస వచ్చాయి. తాజా ఘటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జనం ఆందోళన చెందుతున్నారు.
