గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం.
నగరంలోని ధర్మపురి హిల్స్ రోడ్డు లో ఓ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వ్యక్తి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.
మృతుని వివరాలు తెలిసిన వారు ఆరవ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.