HomeTelanganaNizamabadఅధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి… నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ నీరడి లక్ష్మణ్

అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి… నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ నీరడి లక్ష్మణ్

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో బి.ఎస్.పి పార్టీని బలోపేతం చేసి అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ నీరడి లక్ష్మణ్ తెలిపారు.


నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం బహుజన సమాజ్ పార్టీ రూరల్ నియోజకవర్గం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…


రూరల్ నియోజకవర్గం పరిధిలో బి.ఎస్.పి పార్టీని బలోపేతం చేసి అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగానే మోపాల్, ఇందల్ వాయి, నిజామాబాద్ రూరల్ లో పార్టీని బలోపేతం చేయడానికి సెక్టార్, బూత్ కమిటీలను వేసి, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.

అదేవిధంగా వారం రోజులలో మండల కమిటీలు సైతం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు పోతే ప్రవీణ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సంపత్, మండల అధ్యక్షులు అనిల్, లింగల్వాయి మండల అధ్యక్షులు ప్రసాద్,
డిచ్పల్లి మండల అధ్యక్షులు హర్ష, రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, నియోజకవర్గ కార్యదర్శి ప్రభుదాస్, బి.ఎస్.పి సీనియర్ నాయకులు ఎడ్ల రాములు, బీఎస్పీ నాయకులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments