రేవంత్ లో అబద్ధాలు, బూతుల్లో సీఎం రేవంత్తో పోటీపడలేం. మేం నీళ్లు పారించమంటే.. ఆయన రక్తం పారిస్తామంటున్నారని . బిఆర్ యస్ నేత హరీష్ రావు అన్నారు ఆయన ఆదివారం మీడియా తో మాట్లాడారు హిట్లర్ తనకు ఆదర్శమన్న రేవంత్ అలాగే మాట్లాడుతున్నారు.
సీఎం రేవంత్లో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది.. అందుకే అలా మాట్లాడుతున్నారు. నీళ్ల విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకోం. రేవంత్కు ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ రైతుల పంటల మీద లేదు. మేడిగడ్డ అంశంలో సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే’..ముఖ్యమంత్రికి కాళేశ్వరంపై అవగాహన రాలేదు.
ఎల్లంపల్లి నుంచి 20 ఏళ్లుగా నీళ్లు తీసుకుంటున్నాం అంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాకే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 8 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్కు తాగునీరు రావాలి.
వాస్తవాలు చెబుతుంటే జైలులో పెడతామని బెదిరిస్తున్నారు’ అని అన్నారు.అదే మాట అంటే రిటైర్ ఇంజనీర్ల ను కూడా బెదిరిస్తున్నాడు బొక్కలో వేస్తానని ధమ్కీ ఇస్తున్నదన్నారు అంతే కానీ నీళ్లు ఇస్తానని మాత్రం అంటలేదన్నారు
