HomeTelanganaNizamabadముగిసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్..

ముగిసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్..

నిజామాబాద్ మున్సిపాలిటీలో జూన్ 2, 2025 నుండి సెప్టెంబర్ 10, 2025 వరకు అమలు చేసిన 100 రోజుల మున్సిపల్ యాక్షన్ ప్లాన్ (100 రోజుల కార్యాచరణ ప్రణాళిక) ముగిసింది.

ఈ ప్రణాళిక యొక్క లక్ష్యం పట్టణాల సుస్థిర అభివృద్ధిని సాధించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, క్లీన్ అండ్ గ్రీన్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి సారించడం.

మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ముగించారు . ఈ ముగింపు ర్యాలీ నీ మున్సిపల్ కార్యాలయం నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు తీసి ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. 100 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది నీ అభినందిస్తూ ఇదే స్పూర్తి తో భవిష్యత్ లో పని చేస్తూ నగరం నీ పరిశుభ్రంగా , స్వచమైన నీటిని ప్రజలకు అందిస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

అదేవిధంగా బాగా పనిచేసిన అధికారుల ను , సిబ్బంది కి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఆడిషన్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డివైఈఈ, ఏఈ, శానిటేషన్, ఇంజనీరింగ్, మెప్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments