పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ఆదివారం గాంధీ భవన్ లో అట్టహాసంగా బాధ్యతలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంచార్జ్ దీపా దాస్ మున్షి సమక్షం లోనే ఆయన ఛార్జి తీసుకున్నారు
అంతకుముందు మహేష్ నార్సింగ్ లో ఆయన ఇంటి నుంచి నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరిన మహేష్ గౌడ్ అమరవీరులకు స్థూపం వద్దకు చేరుకున్నారు.
ఆయన వెంట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఉన్నారు.
అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం భారీ ర్యాలీగా గాంధీ భవన్కు చేరుకోనున్నారు.అయితే జిల్లాకు చెందిన మహేష్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో జిల్లా నుంచి కాంగ్రెస్ నేతలు పెద్దసంఖ్యలో గాంధీ భవన్ కు తరలివెళ్లారు.
