ఆడ పిల్లను అంగట్లో అమ్మేసిన ఉదంతం ఆర్మూర్ లో వెలుగు చూసింది. కానీ పోలీసులు రంగంలోకి దిగి ముఠా అటకట్టించారు.
నందిపేట్ మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన అంగేటి లక్ష్మి-పోశెట్టి దంపతులకు జన్మించిన 7 నెలల చిన్నారిని ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఓ ముఠా అమ్మకానికి పెట్టింది.
ఆర్థిక కష్టాలనేపథ్యంలో ఈ ముఠా చెప్పిన మాయమాటలకు ఆ తల్లిదండ్రులు తమ పొత్తిల్లో ఉన్న ఆడ పిల్లను అమ్మడానికి సిద్ధం అయ్యారు.
ఆ ముఠా రంగంలోకి దిగింది వారం రోజుల క్రితం రూ.30 వేలకు పెర్కిట్కు చెందిన షేక్ హబీబి- మహమ్మద్ గౌస్ దంపతులకు అమ్మేసారు .ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఈ ముఠా నుంచి అమ్మాయి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.
అయితే ఈ ముఠా అమ్మాయి ఎంత కు అమ్మేసారు కన్న తల్లిదండ్రులకు ఎంత ముట్ట జెప్పారనేది పోలీసులు అరా తీస్తున్నారు. అమ్మాయి నిజామాబాద్ శిశురక్షణ కేంద్రం నిర్వహులకు అప్పగించారు
