ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటిక్రితమే నిజామాబాద్ చేరుకున్నారు. ఆయన బేగంపేట్ నుంచి హెలిక్యాపిటర్ లో వచ్చారు కలెక్టరేట్ కార్యాలయంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసారు.
అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో నేరుగా డీఎస్ ఇంటికి చేరుకున్నారు. డీఎస్ పార్థవదేహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు.. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మేయర్ సంజయ్ లను పరామర్శించారు.
ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం రేవంత్ తోపాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీఎస్ కు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్.. డీఎస్ క్రమశిక్షణ కలిగిన నాయకుడన్నారు. కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలు మరవలేరన్నారు.
కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ చీఫ్ వరకు ఎదిగారని.. తెలంగాణ ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారు. డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు.
కాగా, నిజామాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు మరికాసేపట్లో నిర్వహించనున్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీ శ్రీనివాస్.. జూన్ 29వ తేదీ శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.