ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు (90) బుధవారం మృతి చెందారు . వృద్ధాప్య సమస్యలతో కొన్ని రోజులుగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రి చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు.
టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న అయన 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లినప్పుడు తిరుగుబాటు చేసారు నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ నెల రోజులకే ఆ ప్రభుత్వం కూలిపోయింది.
రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా నిలిచారు.ఆయన కొడుకు మనోహర్ జనసేన లో కీలకంగా ఉన్నారు ప్రస్తుతం ఏపీ లో మంత్రి గా పనిచేస్తున్నారు.
