ఈడి మోడీ లు వేరు కాదని ఒక్కటే నని బిఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు ఆయన బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు
కేంద్రం, రాష్ట్రం రాక్షస పాలన చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు దారుణమన్నారు.
బి ఆర్ ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం… మా వాళ్లపైన ఒక దెబ్బ పడితే మేము 100 దెబ్బలు కొట్టడానికైనా రెడీ.
వంద రోజులలోపు 6 గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేటికి 111 రోజులు కావస్తున్న జనాలకు మూడు నామాలు పెట్టిందే తప్ప గ్యారంటీలు అమలు చేయలేదన్నారు .ఢిల్లీకి ముడుపులుపంపడానికే కాంగ్రెస్ నేతలు కష్టపడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు
ఢిల్లీ అధిష్టానం పెద్దలకు కప్పం కట్టే పాలన.సాగిస్తున్నారని బెదిరించి పార్టీలు మార్చేలా చేస్తున్నారన్నారు.బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మన బాజిరెడ్డి గోవర్ధన్ నిర్ణయించింది ఆయనగెలుపు కోసం కృషి చేస్తామన్నారు
సమావేశంలో
BRS పార్టీ నగర అధ్యక్షులు,రాజు
సుజిత్ సింగ్ ఠాకూర్ రవించందర్
జెడ్పీటీసీశ్రీమతి బి. సుమలతరూరల్ మండల పార్టీ అధ్యక్షులు: మీసాల మధుకర్ రావు,తది తరులు పాల్గొన్నారు