సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స డీజీ రాజీవ్ రతన్ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. గుండెపోటుతో ఏ ఐ జి ఆస్పత్రిలో చేరారు చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి .
1991 ఐపీఎస్ బ్యాచ్కి చెందినరాజీవ్ రతన్ . కిందటి ఏడాది మహేందర్రెడ్డి తరవాత ..డీజీపీ రేసులో ఉండే కానీ ప్రభుత్వం విజిలెన్స్ డీజీగా నియమించింది .
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై విచారణ చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది.
గతంలో ఆయన ఉమ్మడి జిల్లాలో ఏ ఎస్పీ గా పనిచేసారు. ముక్కుసూటి అధికారి గా పేరుంది. గత ప్రభుత్వం ఆయనను పదేళ్లుగా ప్రాధాన్యత లేని పోస్టింగ్ లో కొనసాగించింది.