నగరంలో అక్రమంగా మొరం తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు రెండవ టౌన్ ఎస్ఐ యాశీర్ అరఫాత్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..శుక్రవారం రాత్రి నగరంలో వాహనాల తనిఖీ సమయంలో అక్రమంగా ఓ లారీలో మొరం తరలిస్తుండగా పట్టుకొని తనికి చేయగా డ్రైవర్ వద్ద ఎలాంటి పత్రాలు లేవని తెలిపారు.
దీంతో ఆ టిప్పరును పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం మైనింగ్ డిపార్ట్మెంట్ కు తరలించినట్లు ఎస్ఐ యాశీర్ అరఫాత్ పేర్కొన్నారు.
