మహాశివరాత్రి జాగరణ ను పురస్కరించుకొని రుద్రూర్ మండలం చిక్కడ పల్లి గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించేకుస్తీ పోటీలు ఈ యేడాది కూడ అలరించాయి. కిషన్ రావు పటేల్ స్మారకార్థం ఈ పోటీలు నిర్వహిస్తారు .
కుస్తీ పోటీల్లో తలపడేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఖ్యాతి గాంచిన మల్ల యోధులు తరలివచ్చారు. కుస్తీ పోటీల్లో చూడడానికి సమీప గ్రామాల నుండి వేలాది మంది తరలివచ్చారు.కుస్తీ పోటీల్లో గెలుపొందిన మల్ల యోధులకు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలోగ్రామ పెద్దలు, యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.